Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో శనివారం ట్రేడింగ్ లావాదేవీలు జరుగనున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) శనివారం స్పెషల్ లైవ్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నాయి. సాధారణంగా స్టాక్ మార్కెట్లలో ఉదయం 9.15 గంటల నుంచి10 గంటల మధ్య సాధారణ ట్రేడింగ్, అంతకుముందు తొమ్మిది గంటలకు ప్రీ-ఓపెన్ సెషన్ నిర్వహిస్తారు. శనివారం జరిగే ట్రేడింగ్ ప్రీ-ఓపెనింగ్ సెషన్ 11.15 గంటలకు సాధారణ ట్రేడింగ్ 11.30 గంటలకు మొదలై 12.30 గంటలకు ముగుస్తుంది.
అనూహ్య విపత్తులను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టేందుకు శనివారం ప్రయోగాత్మకంగా ఎక్స్చేంజ్లు ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి. సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా ట్రేడింగ్ సాగుతుందని తెలుస్తున్నది. శనివారం సెషన్ను ట్రేడింగ్, సెటిల్మెంట్ అండ్ బిల్లింగ్ పేరుతో రెండు భాగాలుగా విడదీస్తారు. ఈ ట్రేడింగ్లో ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్లో స్టాక్ ప్రైస్ బాండ్ గరిష్టంగా ఐదు శాతం ఖరారు చేస్తారు. సెక్యూరిటీస్ లో అప్పర్ అండ్ లోయర్ సర్క్యూట్ రెండు శాతం వరకూ అనుమతి ఇస్తారు. ఇదిలా ఉంటే, అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం (జనవరి 22) సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ మూసివేస్తున్నట్లు ఎన్ఎస్ఈ ప్రకటించింది.