Stock Market | రెండు రోజుల వరుస నష్టాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఉదయం లాభాలతో మొదలయ్యాయి. 300 పాయింట్లకుపైగా 65,532 పాయింట్ల వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 65,457 పాయింట్ల కనిష్ఠానికి చేరగా.. 65,740 పాయింట్లకుపైగా గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 405.53 పాయింట్ల పెరిగి 65,631 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 108.20 పాయింట్ల పెరిగి.. 19,544.30 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్లో దాదాపు 2,178 షేర్లు పెరగ్గా.. 1,361 షేర్లు క్షీణించాయి.
అదే సమయంలో 121 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో బజాజ్ ఆటో, లార్సెన్ అండ్ టూబ్రో, టైటాన్ కంపెనీ, ఎంఅండ్ఎం, టీసీఎస్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో ఇండస్ట్రీస్, సిప్లా, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా నష్టపోయాయి. ఆటో, బ్యాంక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ 0.5 నుంచి 1 శాతం వరకు పెరిగాయి. అయితే, ఫార్మా, పవర్, పీఎస్యూ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు కనిపించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగియగా.. స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగింది.