Stock Market | ధన త్రయోదశి వేళ దేశీయ బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ఉదయం నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్లపై సైతం పడింది. ముగింపు దశలో ఒక్కసారిగా కొనుగోళ్లు పుంజుకొని లాభాల్లోకి వెళ్లాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 64,756.11 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రాడేలో 65,014.06 పాయింట్ల గరిష్ఠానికి, 64,580.95 పాయింట్ల కనిష్టాన్ని నమోదు చేసింది.
చివరకు 72.48 పాయింట్ల లాభంతో 64,904.68 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 30.05 పాయింట్లు లాభంతో 19,425.35 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, టాటా కంన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్, టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, హీరో మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.