Stock Market | అదానీ గ్రూప్పై హిడెన్బర్గ్ నివేదిక మధ్య మార్కెట్లలో ఊగిసలాట కొనసాగుతున్నది. గురువారం ట్రేడింగ్లో సూచీలు పెరుగుతూ తగ్గుతూ.. చివరకు సెన్సెక్స్ 224.16 పాయింట్ల లాభంతో 59,932.24 వద్ద స్థిరపడింది. అదే సమయంలో నిఫ్టీ 5.90 పాయింట్లు తగ్గి 17610.40 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్లో అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగింది. కంపెనీకి చెందిన చాలాషేర్లు లోయర్ సర్క్యూట్ను తాకాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీరంగ షేర్లు లాభపడ్డాయి. ఐటీసీ, ఎస్బీఐ, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్యూఎల్, ఇన్ఫోసిస్ లాభపడగా.. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివిల్ ల్యాబ్ తదితర షేర్లు నష్టాల్లో ముగిశాయి.