Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) గురువారం నాటి నష్టాల నుంచి తేరుకున్నాయి. శుక్రవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ మార్కెట్లో సూచీలు రాణిస్తున్నాయి. గత సెషన్లో భారీ నష్టాలను చవిచూసిన ట్రేడర్లు.. కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు చేపట్టడం కలిసిసొచ్చింది. ఫలితంగా సెన్సెక్స్ ఒక దశలో 900 పాయింట్లకు పైగా లాభాల్లోకి దూసుకెళ్లింది.
కానీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో సెన్సెక్స్ 785 పాయింట్ల లాభంతో 74,992 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 280 పాయింట్లు పుంజుకొని, 23,282 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, కోల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
కాగా గురువారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. నేటి ట్రేడింగ్లో ఆసియా మార్కెట్లు అదేబాటులో ఉన్నాయి. నేషనల్ స్టాక్ఎక్స్ఛేంజ్, షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ మాత్రం లాభాల్లో సాగుతున్నాయి.