Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్ 158 పాయింట్ల నష్టంతో 63,010 పాయింట్ల, నిఫ్టీ 43 పాయింట్లు పతనమై 18,712 పాయింట్ల వద్ద ట్రేడింగ్ షురూ అయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు దేశీయ మార్కెట్లపై చూపాయి. అయితే, చివరి గంటలో సెన్సెక్స్ 160 పెరగ్గా.. నిఫ్టీ 18,800 మార్క్ దాటింది. చివరకు 159.40 పాయింట్ల లాభంతో 63,327.70 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 61.28 పాయింట్లు బలపడి 18,816.70 పాయింట్ల వద్ద నిలిచింది. నిఫ్టీలో టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐషర్ మోటార్స్ లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, సన్ ఫార్మా, బీపీసీఎల్, దివీస్ ల్యాబ్స్ నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగియగా.. పవర్ ఇండెక్స్ ఒక శాతం పెరిగింది. అయితే ఆటో, రియల్టీ, మెటల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక్కొక్కటి 0.5 శాతం లాభాలను నమోదు చేశాయి.