stock market : భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 983 పాయింట్లు, నిఫ్టీ 275 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ ఉదయం 77,483.80 పాయింట్ల వద్ద నష్టంతోనే ప్రారంభమైంది. రోజంతా ట్రేడింగ్ మొత్తం నష్టాల్లోనే కొనసాగింది. ఏ దశలోనూ పుంజుకోలేదు. ఇంట్రాడేలో 76,403.87 వద్ద కనిష్ట స్థాయికి చేరింది. చివరకు 982.71 పాయింట్ల (1.27%) నష్టంతో 76,681.29 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 275.10 పాయింట్ల (1.14%) నష్టంతో 23,879.95 వద్ద ముగిసింది. బీఎస్ఈకి సంబంధించి ఒక్క రోజులోనే లిస్టెడ్ కంపెనీల విలువ భారీగా తగ్గింది. రూ.4 లక్షల కోట్లు నష్టపోయి రూ.461 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా సంస్థలు నష్టాలు చవిచూశాయి. ఇందులో ఇన్ఫోసిస్ షేర్లు 7 శాతం పడిపోయాయి. ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ లాభాలు చవిచూశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 107.12 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
బంగారం ఔన్స్ ధర 4681 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 94.25గా ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా తగ్గకపోవడం, అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్ నష్టాలకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.