Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నారు. బుధవారం ట్రేడింగ్లో సెషన్లో సెన్సెక్స్ తొలిసారిగా 64వేల మార్క్ను అధిగమించింది. మరో వైపు తొలిసారిగా నిఫ్టీ 19వేల మార్క్ను తాకింది. బుధవారం సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లపైగా లాభంతో ట్రేడవుతున్నది. మెటల్ రంగ షేర్లు మార్కెట్ జీవిత గరిష్ఠానికి చేరుకునేందుకు దోహదం చేశాయి. ఇవాళ ట్రేడింగ్ మూడు సెషన్లలో ఇన్వెస్టర్లు రూ.3లక్షల కోట్లపైగా లాభాలను ఆర్జించారు.
దేశంలో రుతుపవనాల ప్రవేశంతో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పాటు హెచ్డీఎఫ్సీ, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ల విలీనం జులై ఒకటి నుంచి అమలులోకి వస్తుందన్న ప్రకటన, జూన్ డెరివేటివ్ సిరీస్ గడువు ముగియడం మార్కెట్ ఆల్ టైమ్ హైకి చేరుకోవడంలో ఉపకరించాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ సెషన్లో ప్రధాన బెంచ్ మార్క్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ రెండు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. ఉదయం సెన్సెక్స్ 63,701.78 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ 200 పాయింట్ల వరకు ఎగబాకి 63,716.00 పాయింట్ల ఆల్టైమ్ హైకి చేరింది. నిఫ్టీ 62.40 పాయింట్లు పెరిగి 18,879.80 వద్ద మొదలైంది.