Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వారంలో తొలిరోజైన సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు జీవితకాల గరిష్టం దిశగా పయనించినా.. రికార్డ్ మార్క్ను అందుకోలేకపోయాయి. మదుపురులు లాభాల స్వీరణకు దిగడంతో ట్రేడింగ్ మొదలైన గంటలోనే సూచీలు పతనం వైపు పరుగులుపెట్టాయి. దానికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు సైతం నష్టాలకు కారణమయ్యాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 63,471.21 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలై ఒక దేశలో 63,574.69 పాయింట్లకు చేరి.. ట్రేడింగ్ ముగిసే సరికి 216.88 పాయింట్లు పతనమై 63,168.30 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 18,873.30 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలై.. చివరకు 70.55 పాయింట్లు తగ్గి 18,755.45 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో దాదాపు 1,623 షేర్లు పురోగమించగా.. 1,937 షేర్లు క్షీణించాయి. అలాగే 163 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో అదానీ ఎంటర్ప్రైజెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ అత్యధికంగా నష్టపోయాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, టీసీఎస్ లాభపడ్డాయి. సెక్టార్లలో ఆటో, బ్యాంక్, రియల్టీ, పవర్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ ఒక్కొక్కటి 0.5 శాతం తగ్గగా.. పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఒక శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.4 శాతం పెరిగింది. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ముగిశాయి.