Stock Market | వరుసగా మూడోరోజు దేశీయ బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు బుధవారం ఉదయం మార్కెట్లు నష్టాలతోనే మొదలైన చివరకు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. వడ్డీరేట్లపై అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ క్రమంలో సెన్సెక్స్ 63,115 పాయింట్ల వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 63,013 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు టేడ్రింగ్ ముగిసే సరికి 85.35 పాయింట్ల లాభపడి 63,228.51 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ టేడ్రింగ్లో 39.75 పాయింట్లు లాభపడగా.. 18,755.90 పాయింట్ల వద్ద ముగిసింది. టాటా కన్యూమర్స్ ప్రొడక్ట్స్, టాటాస్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటామోటార్స్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ స్టాక్స్ లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.