Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం ఫ్లాట్నోట్లో ముగిశాయి. ఉదయం సూచీలు లాభాల్లో మొదలవగా.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం సెన్సెక్స్ 66,084.37 పాయింట్లతో వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రాడేలో 66,235.24 గరిష్ఠాన్ని తాకగా.. 65,980.50 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 5.43 పాయింట్ల నష్టంతో 66,017.81 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 9.85 పాయింట్ల పతనమై 19,802 వద్ద ముగిసింది.
హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్స్గా నిలువగా.. సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్టీఐఎండ్ట్రీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, లార్సెన్ అండ్ టూబ్రో నష్టపోయాయి. హెల్త్కేర్ ఇండెక్స్ ఒక శాతం తగ్గింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.5 శాతంతో ముగిసింది. రియాల్టీ, చమురు అండ్ గ్యాస్ ఒక్కొక్కటి శాతం, ఆటో ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు లాభాల్లో ముగిశాయి.