ముంబై, డిసెంబర్ 22: ఈ వారం మధ్యలో జరిగిన భారీ పతనం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు వేగంగా కోలుకుంటున్నాయి. వరుసగా రెండో రోజూ సూచీలు పుంజుకున్నాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 242 పాయింట్లు లాభపడి 71,107 పాయింట్ల వద్ద ముగిసింది.
రెండు రోజుల్లో 600 పాయింట్లకుపైగా కోలుకున్నది. ఇంట్రాడేలో 394 పాయింట్లు పెరిగి 71,259 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 21,390 పాయింట్లకు పెరిగిన అనంతరం చివరకు 94 పాయింట్ల లాభంతో 21,349 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.