Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లలో సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో మొదలగా.. రోజంతా గ్రీన్మార్క్లోనే కొనసాగాయి. ట్రేడింగ్లో బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లు భారీగా జరగ్గా.. మార్కెట్ బలాన్ని ఇచ్చినట్లయ్యింది.
సెన్సెక్స్ 630 పాయింట్లు పెరిగి.. 55.397.53 వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు పెరిగి.. 16,521 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో టెక్ మహీంద్రా మంచి లాభాలను ఆర్జించింది. టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సిప్లా షేర్లు టాప్ గెయినర్లుగా నిలువగా.. ఎంఅండ్ఎం, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ తదితర స్టాక్స్ అమ్మకాలు జరగ్గా.. ఆయా స్టాక్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి.