న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారతీయ మార్కెట్లు కుప్పకూలాయి. గురువారం మార్కెట్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో రూ.8లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మార్కెట్ క్యాప్లో గణనీయమైన క్షీణత గత ట్రేడింగ్ సెషన్లో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.255.68 లక్షల కోట్లు కాగా, గురువారం భారీ పతనంతో రూ.248.09 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం బీఎస్ఈ 30 షేర్ల సూచీ సెన్సెక్స్ 1800 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్లోని మొత్తం 30 స్టాక్స్ రెడ్ మార్క్లో ట్రేడవుతున్నాయి.
ప్రతికూల మార్కెట్ సెంటిమెంట్ మధ్య మిడ్క్యాప్, స్మాల్క్యాప్ స్టాక్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 576 పాయింట్లు, 804 పాయింట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ స్టాక్స్లో టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా ఇప్పటి వరకు అత్యధికంగా నష్టపోయాయి. ఈ నెల 16న నుంచి భారతీయ స్టాక్ మార్కెట్లలో గందరగోళం కారణంగా పెట్టుబడిదారులు భారీగా నష్టాలను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధం వాతావరణం. ఇది ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.