Stock Market Closing | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) సోమవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో మార్కెట్లు లాభపడ్డాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 76,978.53 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రారంభంలోనే సెన్సెక్స్ (Sensex) 300 పాయింట్లకుపైగా పెరిగింది. చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. ఇంట్రాడేలో 76,584.84 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. 77,318.94 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 454.11 పాయింట్ల లాభంతో.. 77,073.44 వద్ద స్థిరపడింది. నిఫ్టీ (Nifty) సైతం 141.55 పెరిగి.. 23,344.75 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో దాదాపు 2,399 షేర్లు లాభపడ్డాయి.
మరో 1,492 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్ లాభపడ్డాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ మినహా ఇతర అన్ని సూచీలు బ్యాంక్, మీడియా, మెటల్, క్యాపిటల్ గూడ్స్, పీఎస్యూ, టెలికాం, పవర్, పీఎస్యూ బ్యాంక్ ఒకటి నుంచి రెండుశాతం వరకు పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.66 శాతం పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు ఒకశాతం పైకి కదిలింది.