Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాలతో సూచీలు లాభాల్లో మొదలవగా.. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి వెళ్లాయి. ఆ తర్వాత దశలోనూ సూచీలు కోలుకోలేదు. క్యాపిటల్ గూడ్స్, పవర్, ఎఫ్ఎంసీజీ పేర్లలో అమ్మకాలతో అస్థితరకు గురయ్యాయి. మార్కెట్ ప్రారంభంలో వచ్చిన లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి తీవ్రతరం కావడంతో నష్టాలు తప్పలేదు. ఉదయం 2,000.20 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్ ఒక దశలో 72,142.23 పాయింట్ల గరిష్ఠానికి చేరుకుంది.
ఇంట్రాడేలో 71,075.72లో పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 801.67 పాయింట్ల నష్టంతో 71,139.90 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 215.50 పాయింట్ల నష్టంతో 21,522.10 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్ నష్టపోగా అత్యధికంగా నష్టపోయాయి. టాటా మోటార్స్, బిపీసీఎల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ లాభపడ్డాయి. రియల్టీ, పీఎస్యూ బ్యాంక్ మినహా అన్ని రంగాల్లోనూ క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, పవర్ 0.5-1 శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పతనం కాగా.. స్మాల్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగిసింది.