Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస ఆరో రోజుల లాభాలకు బ్రేక్ పడింది. బుధవారం బెంచ్ మార్క్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ ఇవాళ ఉదయం 73,267.48 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. సెన్సెక్స్ భారీగా పెరడంతో ఐటీ, ఫైనాన్షియల్, ఫార్మారంగాల భారీగా అమ్మకాలు జరిగాయి. దాంతో ప్రారంభంలో వచ్చిన లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఒక దశలో 73,267.80 పాయింట్ల గరిష్ఠానికి చేరుకున్న సెన్సెక్స్.. ఇంట్రాడేలో 72,450.56 పాయింట్ల కనిష్ఠానికి చేరుకున్నది. చివరకు 434.30 పాయింట్ల నష్టంతో 72,623.09 వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం 141.90 పాయింట్ల నష్టంతో 22,055.05 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో దాదాపు 1,227 షేర్లు పురోగమించగా.. 2078 షేర్లు క్షీణించాయి. 69 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో బిపీసీఎల్, కోల్ ఇండియా, హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్ కార్ప్, ఎన్టీపీసీ అత్యధికంగా నష్టపోయాయి. టాటా స్టీల్, ఎస్బీఐ, జెఎస్డబ్ల్యూ స్టీల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే రియాల్టీ, పీఎస్యూ బ్యాంక్ మినహా మిగిలిన అన్ని సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒక్కోశాతం చొప్పున పడిపోయాయి.