Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాల్లో ముగిశాయి. గతవారం రికార్డు స్థాయిలో 75వేల మార్క్ను దాటిన సెన్సెక్స్ తాజాగా 73వేల పాయింట్ల దిగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవరాలతో దేశీయ మార్కెట్లపై ప్రభావం పడుతున్నది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న సంక్షోభం మధ్య మార్కెట్లు పతనమవుతున్నాయి. కిత్రం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 72,892.14 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో 72,685.03 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 73,135.43 మార్క్ను చేరుకున్నది.
చివరకు 456.10 పాయింట్ల నష్టంతో 72,943.68 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 124.60 పాయింట్లు పతనమై.. 22,147.90 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో దాదాపు 2,218 షేర్లు పురోగమించగా.. 1,464 షేర్లు పతనమయ్యాయి. 105 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో ఐచర్ మోటార్స్, దివిస్ ల్యాబ్, టైటన్ కంపెనీ, హెచ్యూఎల్, ఓఎన్జీసీ లాభాల్లో ముగియగా.. ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్టీఐమైండ్ట్రీ, విప్రో, బజాజ్ ఫైనాన్స్ నష్టాల్లో ముగిశాయి. సెక్టోరల్ ఫ్రంట్లో బ్యాంక్, ఐటీ, రియల్టీ 0.5 నుంచి ఒకశాతం వరకు పతనమయ్యాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ ఒకశాతం పెరిగింది.