Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వారంలో తొలిరోజైన సోమవారం నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో పాటు పలు రంగాల్లో అమ్మకాలతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే బెంచ్ మార్క్ సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. పొద్దంతా నష్టాల్లోనే కొనసాగాయి. ఉదయం 73,044.81 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. ఒక దశలో 72,666.82 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. ఇంట్రా డేలో 73,092.26 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 352.66 పాయింట్ల నష్టంతో 72,790.13 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 90.70 పాయింట్లు నష్టపోయి 22,122 వద్ద ముగిసింది.
ట్రేడింగ్లో దాదాపు 1,538 షేర్లు పెరగ్గా.. 1,907 షేర్లు పతనమయ్యాయి. మరో 107 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో ఏషియన్ పెయింట్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ టాప్ లూజర్స్గా నిలిచాయి. పవర్ గ్రిడ్ కార్ప్, ఎల్అండ్టీ, అదానీ ఎంటర్ప్రైజెస్, బీపీసీఎల్, టాటా కన్స్యూమర్ లాభపడ్డాయి. సెక్టార్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్ ఒకశాతం, బ్యాంక్, ఫార్మా 0.5 శాతం చొప్పున పతనమయ్యాయి. మరోవైపు, చమురు అండ్ గ్యాస్, పవర్, క్యాపిటల్ గూడ్స్ 0.5 నుంచి ఒకశాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగిసింది.