Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో మొదలైన సూచీలు పొద్దంతా అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్ మరోసారి 74వేల మార్క్ను తాకింది. ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాలు దేశీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లు బుధవారం లాభాల్లో ఆర్జించాయి. అలాగే ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవగా.. చైనా, హాంకాంగ్, ఆస్ట్రేలియా మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడయ్యాయి. ఈ క్రమంలో భారతీయ మార్కెట్లు సైతం రాణించాయి. దీనికి తోడు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్లో కొనుగోళ్లతో సూచీలు పరుగులు తీశాయి. ఉదయం సెన్సెక్స్ కిత్రం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 73,149.34 పాయింట్ల వద్ద లాభంతో మొదలైంది. ఆ తర్వాతే జోరును కొనసాగించింది.
కనిష్ఠంగా 73,120.33 పాయింట్లను తాకిన సెన్సెక్స్.. చివరి సెషన్లో గరిష్ఠంగా 74,190.31 పాయింట్లకు పెరిగింది. చివరకు 639.16 పాయింట్లు పెరిగి.. 73,635.48 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 203.25 పాయింట్లు పెరిగి.. 22,326.90 వద్ద ముగిసింది. దాదాపు 1,912 షేర్లు పురోగమించగా, 1784 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్వ్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్ అత్యధికంగా లాభపడ్డాయి. శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్ నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఆటో, హెల్త్కేర్, మెటల్, పవర్, క్యాపిటల్ గూడ్స్ ఒక శాతం చొప్పున లాభాల్లో ముగియగా.. ఆయిల్ అండ్ గ్యాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంక్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగాయి.