Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. వరుసగా నాలుగో సెషన్లోనూ లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలతో పాటు మార్కెట్లలో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. నిఫ్టీ మరోసారి 22వేల పాయింట్ల ఎగువన ముగియగా.. నిఫ్టీ 370 పాయింట్లకుపైగా లాభాలను నమోదు చేసింది.
క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ ఇవాళ ఉదయం 72,406.02 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. పొద్దంతా అదే జోరును కొనసాగించాయి. ఇంట్రాడేలో 72,218.10 పాయింట్ల కనిష్ఠానికి చేరగా.. 72,545.33 పాయింట్ల గరిష్ఠాన్ని అందుకున్నది. చివరకు 376.26 పాయింట్ల లాభంతో 72,426.64 వద్ద ముగిసింది. నిఫ్టీ 129.95 పాయింట్ల పెరిగి.. 22,040.70 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో దాదాపు 1,950 షేర్లు పెరిగాయి. మరో 1,367 షేర్లు పతనమవగా.. 56 షేర్లు మాత్రం మారలేదు.
నిఫ్టీలో విప్రో, ఎంఅండ్ఎం, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ అత్యధికంగా లాభపడ్డాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, బ్రిటానియా ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి. పీఎస్యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ మినహా రంగాల షేర్లు లాభాలను నమోదు చేశాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఐటీ, రియాల్టీ ఒకటి నుంచి రెండుశాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు దాదాపు ఒకశాతం చొప్పున పెరిగాయి.