Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 74,022.30 పాయింట్ల వద్ద ఫ్లాట్గా మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 73,743.77 పాయింట్ల కనిష్ఠానికి చేరుకున్న సెన్సెక్స్.. 74,099.78 పాయింట్ల గరిష్ఠానికి చేరుకున్నది. చివరకు 110.64 పాయింట్ల నష్టంతో 73,903.91 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 8.70 పాయింట్లు పతనమై.. 22,453.30 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్లో దాదాపు 2,686 షేర్లు పెరిగాయి. 1,015 షేర్లు క్షీణించగా.. మరో 111 షేర్లు మారలేదు. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ మరియు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ లూజర్గా నిలిచాయి. టాటా కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్, ఎంఅండ్ఎం, బీపీసీఎల్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్ లాభాల్లో పయనించాయి. సెక్టార్లలో రియల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, పవర్, ఆటో 1-2 శాతం లాభపడ్డాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికాం సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒకశాతం చొప్పున పెరిగాయి.