ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బుధవారం నష్టాలతో ముగియగా.. గురువారం లాభాలతో ట్రేడింగ్ మొదలైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30-షేర్ సెన్సెక్స్ ఇండెక్స్ 503 పాయింట్ల లాభంతో 54,252 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ ఇండెక్స్ 144 పాయింట్లు పెరిగి.. 16,170 వద్ద ట్రేడింగ్ ముగిసింది. అంతకుముందు, మిశ్రమ ప్రపంచ సూచనల మధ్య స్టాక్ మార్కెట్ రెండు ఇండెక్స్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. భారత స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 0.59 శాతం లాభపడి 54,065 వద్ద ట్రేడింగ్ మొదలైంది.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 0.57శాతం లాభపడి 16,117 వద్ద ట్రేడింగ్ షురూ అయ్యింది. దాదాపు 1712 షేర్లు పురోగమించగా, 1509 షేర్లు క్షీణించాయి. 126 షేర్లలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. నిఫ్టీలో టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లో కొనసాగగా.. ఐటీసీ, యూపీఎల్, దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి. మెటల్, ఐటీ, పవర్, రియాల్టీ, బ్యాంక్, ఆయిల్, గ్యాస్ షేర్లు 1-3 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.4 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.78 శాతం పెరిగాయి.