Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు.. దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. రోజంతా మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 72,507.36 పాయింట్ల వద్ద లాభంతో మొదలైంది. ఇంట్రాడేలో 72,416.03 పాయింట్ల కనిష్ఠానికి చేరుకున్న సెన్సెక్స్.. 72,882.46 పాయింట్ల గరిష్ఠానికి పెరిగింది. చివరకు 539.50 పాయింట్ల నష్టంతో 72,641.19 పాయింట్ల వద్ద స్థిరపడింది.
మరో వైపు నిఫ్టీ 172.85 పాయింట్లు పెరిగి 22,011.95 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో దాదాపు 2,591 షేర్లు పెరగ్గా.. మరో 766 పతనమయ్యాయి. 88 యథావిధిగా కొనసాగాయి. నిఫ్టీలో టాప్ గెయినర్స్గా బీపీసీఎల్, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, కోల్ ఇండియా నిలిచాయి. టాప్ లూజర్స్గా భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, మారుతి సుజూకీ, ఐసీఐసీ బ్యాంక్ నష్టాల్లో ముగిశాయి. అన్ని రంగాలు గ్రీన్లో ముగిశాయి, నిఫ్టీ పీఎస్ఈ ఇండెక్స్ 3.5 శాతం పెరిగి టాప్ సెక్టోరల్ గెయినర్గా నిలిచింది.