న్యూఢిల్లీ, మే 26: ప్రభుత్వ రంగ చమురు ఉత్పాదక కంపెనీ ఓఎన్జీసీ నికరలాభం నాల్గవ త్రైమాసికంలో సగానికిపైగా తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కంపెనీ లాభం 53 శాతం క్షీణించి రూ. 5,701 కోట్లకు పడిపోయింది. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో ఓఎన్జీసీ రూ.12,061 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది.
అయితే సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 1.55 లక్షల కోట్ల నుంచి రూ.1.64 లక్షల కోట్లకు చేరింది. శుక్రవారం సమావేశమైన ఓఎన్జీసీ డైరెక్టర్ల బోర్డు షేరుకు 50 పైసల చొప్పున తుది డివిడెండ్ను సిఫార్సుచేసింది.