హైదరాబాద్, మే 27: రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.505.9 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 12 శాతం తగ్గింది.
కానీ, సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 11 శాతం పెరిగి రూ.6,472.96 కోట్లకు చేకకుఉన్నది. ఫార్ములేషన్ విక్రయాలు రూ.592 కోట్లకు చేరుకోవడం ఆదాయం పెరగడానికి ప్రధాన కారణమని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.24,855.3 కోట్ల ఆదాయంపై రూ.1,927.6 కోట్ల నికర లాభాన్ని గడించింది.