న్యూఢిల్లీ, మే 18: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.16,694.51 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.9,113.53 కోట్ల లాభంతో పోలిస్తే 83 శాతం వృద్ధి నమోదైంది. వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడం, మొండి బకాయిలను పూడ్చుకోవడానికి నిధుల కేటాయింపులు తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.