సుల్తాన్బజార్, డిసెంబర్ 26: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా శ్రీనివాస్ చాగంటి సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అబిడ్స్లోని దూర సంచార్ భవన్లో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు.
1987 ఐటీఎస్ బ్యాచ్కు చెందిన శ్రీనివాస్.. గత 34 ఏండ్లుగా వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ తెలంగాణ టెలికం సర్కిల్ సీజీఎంగా నియమితులయ్యారు.