Spicejet Chairman to TATA | ఎయిర్ ఇండియా (ఏఐ) బిడ్ను గెలుచుకున్న టాటా సన్స్ గ్రూప్ను స్పైస్జెట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ అభినందనలు తెలిపారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న ఎయిర్ ఇండియా కోసం టాటా సన్స్ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన బిడ్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రూ.18 వేల కోట్లకు టాటా సన్స్ బిడ్ దాఖలు చేసింది. స్పైస్ జెట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్సింగ్ రూ.15,100 కోట్లకు బిడ్ వేశారు.
ఎయిరిండియా బిడ్ను గెలుచుకున్న టాటా గ్రూప్ను నేను అభినందిస్తున్నా. వారు (టాటాసన్స్) విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా. ఎయిర్ ఇండియా కోసం దాఖలు చేసిన బిడ్లలో షార్ట్ లిస్టెడ్ సంస్థల జాబితాలో నేను ఉన్నందుకు గర్విస్తున్నా. ఎయిర్ ఇండియా పూర్వ వైభవాన్ని టాటా గ్రూప్ పునరుద్ధరిస్తుందని నేను విశ్వాసంతో ఉన్నా. భారతీయులందరికీ గర్వకారణంగా ఎయిరిండియాను నిలుపుతుందని నమ్ముతున్నా అని ఓ ప్రకటనలో తెలిపారు.
పారదర్శకంగా, అనువైన ప్రక్రియ చేపట్టి ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణలో విజయవంతమైనందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. భారత ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నా.. నేను నా జీవితంలో ఎయిర్ ఇండియాకు అభిమానిని. ప్రపంచ ఎయిర్లైన్స్కు తిరిగి ఎయిర్ ఇండియా సారధ్యం వహించే టైం ఆసన్నమైంది అని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Air India | ఎయిరిండియా అప్పులు రూ.60వేల కోట్ల పైచిలుకే!
Air India to TATA | ఏడాదిపాటు ఎయిరిండియా ఉద్యోగులకు నో ఉద్వాసన
వెల్కమ్ బ్యాక్, ఎయిర్ ఇండియా.. రతన్ టాటా ట్వీట్
Air India to TATA’s | టాటా చేతికే మహారాజా..