న్యూఢిల్లీ, జనవరి 30: అయోధ్యకు ఏకంగా రోజువారిగా ఎనిమిది విమాన సర్వీసులను నడుపబోతున్నట్లు స్పైస్జెట్ ప్రకటించింది. వచ్చే నెల 1 నుంచి ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, పాట్నా, ముంబై, బెంగళూరుల నుంచి అయోధ్యకు రోజువారి విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.
ఈ నూతన విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్యా సింధియా ప్రారంభించనున్నారు.