న్యూఢిల్లీ: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), స్పైస్జెట్ ఎయిర్లైన్కు రూ.10 లక్షల జరిమానా విధించింది. తప్పుడు సిమ్యులేటర్లపై పైలట్లకు శిక్షణ ఇచ్చినందుకు మే 30న ఈ మేరకు ఫైన్ వేసింది. ఈ నేపథ్యంలో స్పైస్జెట్ ఎయిర్లైన్ దీనిపై సోమవారం వివరణ ఇచ్చింది. మాక్స్ ఎయిర్క్రాఫ్ట్ నడిపేందుకు 650 మంది పైలట్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. అయితే 90 మంది పైలట్లు తప్పుడు సిమ్యులేటర్లపై శిక్షణ పొందినట్లుగా డీజీసీఏ గమనించినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ సూచనల మేరకు ఈ 90 మంది పైలట్లను మాక్స్ ఎయిర్క్రాఫ్ట్ నడపకుండా నిరోధించినట్లు పేర్కొంది.
ఈ 90 మంది పైలట్లకు సరైన సిమ్యులేటర్లపై మళ్లీ శిక్షణ ఇస్తామని స్పైస్జెట్ వివరించింది. వీరి శిక్షణపై డీజీసీఏ సంతృప్తి చెందితే మాక్స్ ఎయిర్క్రాఫ్ట్ను నడిపేందుకు అనుమతిస్తామని వెల్లడించింది. ఈ చర్య వల్ల మాక్స్ విమానాల ఆపరేషన్స్పై ఎలాంటి ప్రభావం ఉండదని స్పైస్జెట్ తెలిపింది. తగినంత శిక్షణ పొందిన పైలట్లు సంస్థకు అందుబాటులో ఉన్నారని పేర్కొంది.
కాగా, బోయింగ్ 737 మాక్స్ ఎయిర్క్రాఫ్ట్ను నడిపేందుకు తప్పుడు సిమ్యులేటర్లపై పైలట్లకు శిక్షణ ఇచ్చిన స్పైస్జెట్కు డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది. అలాగే ఆ 90 మంది స్పైస్జెట్ పైలట్లు బోయింగ్ 737 మాక్స్ ఎయిర్క్రాఫ్ట్ను నడపకుండా చర్యలు చేపట్టింది. వారి శిక్షణ విమానం భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో 90 మంది పైలట్లకు తిరిగి శిక్షణ ఇవ్వాలని స్పైస్జెట్ను డీజీసీఏ ఆదేశించింది.