ముంబై, డిసెంబర్ 2: సావరిన్ గోల్డ్ బాండ్ల విక్రయాలను పెంపొందించడానికి రిజర్వుబ్యాంక్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ బాండ్ల విక్రయానికి ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసింది కూడా. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం 2021-22 సిరీస్-8లో భాగంగా జారీ చేసిన బాండ్లను ఈ నెల 3 వరకు http:// rbi retail direct.org.in పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చునని సూచించింది. ఇప్పటి వరకు ఈ పసిడి బాండ్లు బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పోస్టాఫీస్లు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సేంజ్, ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా విక్రయిస్తున్నారు.