Smart Phones Costly | ప్రతి పండక్కి ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోవాలనుకుంటాం.. ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా 5జీ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుత పండుగల సీజన్లో తమకు నచ్చిన మోడల్.. తమ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అయితే, ఒక్క నిమిషం ఆగండి.. లో బడ్జెట్, హై వాల్యూమ్ ప్రెస్ సెగ్మెంట్లో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి.
అందుకే గతేడాదితో పోలిస్తే ప్రస్తుత పండుగల సీజన్లో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు తొమ్మిది శాతం తగ్గుతాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అంచనా వేసింది. స్మార్ట్ ఫోన్ సంస్థలు తమ లాభాలు కాపాడుకునేందుకు పండుగల సీజన్లో వాటి ధరలు సగటున 12 శాతం పెంచబోతున్నాయి. అంటే ఒక్క ఫోన్ ధర 242 డాలర్లు అంటే రమారమీ రూ.19,300 వరకు పెరగబోతున్నాయి. అధిక ధరలు గల ఫోన్ల విక్రయంతో ఎక్కువ లాభాలు గడించడంపైనే మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు, రిటైలర్లు దృష్టి సారిస్తారని సర్వేలు చెబుతున్నాయి.
కొన్ని నెలలుగా స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ తగ్గిపోయింది కూడా. ఇప్పటికే పది వారాలుగా స్మార్ట్ ఫోన్లు నిల్వలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పండుగల సీజన్లోకి స్మార్ట్ ఫోన్ల మార్కెట్ ఎంటరవుతున్నది. దీనికితోడు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం వల్ల మొబైల్ ఫోన్ యూజర్లు వాటిని కొనుగోలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు.ఈ నేపథ్యంలో 23 నుంచి నాలుగైదు వారాల పాటు కొనసాగే ఫెస్టివ్ సీజన్లో 9 శాతం ఫోన్ల విక్రయాలు తగ్గుతున్నాయని కౌంటర్ పాయింట్ వెల్లడించింది.
2021 స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో 66 శాతం ఈ-కామర్స్ సంస్థల వాటా. ఈ ఏడాది మార్కెట్లో 61 శాతం వాటా పొందుతామని ఆ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కన్జూమర్ల డిమాండ్ను దృష్టిలో పెట్టుకున్న బ్రాండ్లు, చానెల్స్ మిడ్ రేంజ్, ప్రీమియం సెగ్మెంట్ ఫోన్లతోపాటు చౌకగా స్మార్ట్ ఫోన్ల తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
ఇటీవలి కొన్ని త్రైమాసికాల్లో ఎంట్రీ-టైర్, బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. సూక్ష, ఆర్థిక సమస్యల వల్ల ఈ సెగ్మెంట్ల యూజర్లపై ఒత్తిళ్లు కొనసాగుతున్నా..ప్రస్తుత పండుగల సీజన్లో ఈ సెగ్మెంట్ ఫోన్ల సేల్స్ పెరుగుతాయని అంచనా వేస్తున్నాం` అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాథక్ చెప్పారు.
`వివిధ స్మార్ట్ ఫోన్ సంస్థలు రూ.15వేల ధర గల సెగ్మెంట్స్ సేల్స్ కోసం ప్రమోషన్లు, ఆఫర్లు ఇస్తున్నాయి. 4జీ నుంచి 5జీకి మారడం వల్ల కూడా ఈ సెగ్మెంట్లో స్మార్ట్ ఫోన్ల సేల్స్ మరింత పెరుగుతాయని భావిస్తున్నాం. ప్రతి ముగ్గురిలో ఒకరు 5జీ సేవలకు మళ్లే వారే కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులు ఉంటారు` అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది.