న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: వెండి వెలుగులు జిల్లుతున్నది. వచ్చే ఏడాదికాలంలో కిలో వెండి ధర రూ.85 వేలకు చేరుకుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. పారిశ్రామిక, అత్యంత విలువైన లోహాల నుంచి లభించనున్న మద్దతు వచ్చే ఏడాది పండుగ సీజన్ నాటికి వెండి రూ.85 వేలకు చేరుకునే అవకాశాలున్నాయని మోతీలాల్ ఒశ్వాల్ వెల్లడించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ.77-78 వేల స్థాయిలో ఉన్నది. పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్ ఉండటంతో ఈ ఏడాది ఇప్పటి వరకు వెండి ధరలు ర్యాలీని కొనసాగించాయి. తొలి రెండు త్రైమాసికంలో 11 శాతానికి పైగా రిటర్నులు పంచిన వెండి..మిగతా త్రైమాసికాల్లోనూ 15 శాతం రిటర్నులు పంచే అవకాశం ఉన్నది.