Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు జోరును కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మరోసారి ఆల్టైమ్ గరిష్ఠానికి చేరుకుంది. బుధవారం సెక్షన్లో నిఫ్టీ 21,603.40 పాయింట్ల చేరుకొని.. జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం స్వల్పంగా తగ్గి 21,546.80 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీలో హిందాల్కో షేర్లు అత్యధికంగా 3.93 శాతం లాభంతో రూ.602.65 వద్ద కొనసాగుతున్నది. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు సైతం లాభాల్లో పయనిస్తున్నాయి.
బ్యాంకింగ్, ఆటో, ఐటీ రంగాల షేర్లు లాభాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ తొలిసారిగా 21,600 పాయింట్ల మార్క్ను చేరింది. మరోవైపు, సెన్సెక్స్ 397.4 పాయింట్ల లాభంతో 71,727.77 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. ఇదిలా ఉండగా.. మంగళవారం అమెరికా మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడడంతో ప్రధాన సూచీలన్నీ లాభాల్లో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో దేశీయ బెంచ్ మార్కెట్ సూచీలు సైతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.