Reliance | అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్ల పెంపు నిర్ణయం దేశీయ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ను దెబ్బ తీసింది. గతవారం ట్రేడింగ్లో టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థలు రూ.1,34,139.14 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్క్రిప్ట్ భారీగా నష్టపోయింది. గతవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 741.87 (1.26 శాతం) పాయింట్ల పతనంతో ముగిసింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), బజాజ్ పైనాన్స్, ఐటీసీ మినహా బ్లూ చిప్ కంపెనీలన్నీ పతనం అయ్యాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.40,558.31 కోట్లు పతనమై రూ.16,50,307.10 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ. 25,544.89 కోట్లు తగ్గి రూ.8,05,694.57 కోట్లకు పరిమితమైంది. అదానీ ట్రాన్స్మిషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,630.08 కోట్లు నష్టంతో రూ.4,31,662.20 కోట్ల వద్ద ముగిసింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,147.49 కోట్లు పతనమై రూ. 6,14,962.99 కోట్ల వద్ద నిలిచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.9,950.94 కోట్ల నష్టంతో రూ.4,91,255.25 కోట్లతో సరిపెట్టుకున్నది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 9,458.65 కోట్లు కోల్పోయి రూ.10,91,421.84 కోట్ల వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.5,848.78 కోట్లు పడిపోయి రూ.5,74,463.54 కోట్ల వద్ద స్థిర పడింది.
మరోవైపు హెచ్యూఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.35,467.08 కోట్లు పెరిగి రూ.6,29,525.99 కోట్లకు చేరుకుంది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.20,381.61 కోట్లు వృద్ధి చెంది రూ.4,29,198.61 కోట్ల వద్ద ముగిసింది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.13,128.73 కోట్ల లబ్ధితో రూ. 4,54,477.56 కోట్లకు చేరుకుంది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్ టాప్లో కొనసాగుతున్నది. టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, అదానీ ట్రాన్స్మిసన్, ఐటీసీ తర్వాతీ స్థానాల్లో నిలిచాయి.