Stocks | అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర భారీగా దిగి రావడం దేశీయ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ బలోపేతమైంది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ పుంజుకున్నాయి. మంగళవారం ఉదయం ప్రారంభం నుంచే స్టాక్స్ లాభాలు నమోదు చేశాయి. అంతర్గత ట్రేడింగ్లో 24 గంటల గరిష్ఠ స్థాయిని తాకాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం ఉదయం 51,897.60 పాయింట్లతో మొదలైంది. ఇంట్రాడే ట్రేడింగ్లో 52,799.40 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. చివరకు ట్రేడింగ్ ముగింపులో 934.23 పాయింట్ల లాభంతో 52,532.07 పాయింట్ల స్థిరపడింది.
మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 15,455.95 పాయింట్ల వద్ద పాజిటివ్గా మొదలై.. అంతర్గత ట్రేడింగ్లో 15,507.25 పాయింట్ల గరిష్ఠానికి దూసుకెళ్లింది. చివరకు 288 పాయింట్లతో లాభపడి 15,638.80 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారం స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో చిక్కుకోవడంతో ఇన్వెస్టర్లు భారీగా సంపద కోల్పోయిన సంగతి తెలిసిందే.
టైటాన్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, టీసీఎస్, ఎచిర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో లాభ పడ్డాయి. నిఫ్టీ-50లో నెస్ట్లే ఇండియా, అపోలో హాస్పిటల్స్ 0.1 శాతం నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 2.4 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ మూడు శాతం లాభాలతో ముగిసాయి.