ముంబై, ఫిబ్రవరి 16: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలకు లభించిన మద్దతుతో నిఫ్టీ ఏకంగా 22 వేల మార్క్ను మళ్లీ అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లు కోలుకోవడం, మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో వారాంతం ట్రేడింగ్లో సూచీలు భారీగా లాభపడ్డాయి.
30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 376 పాయింట్లు అధికమై 72,426కి చేరుకోగా, నిఫ్టీ 129.95 పాయింట్లు ఎగబాకి 22,040.70 వద్ద నిలిచింది. సూచీల్లో విప్రో అత్యధికంగా 4.79 శాతం పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది. దీంతోపాటు మహీంద్రా, ఎల్అండ్టీ, టాటా మోటర్స్, మారుతి, ఇన్ఫోసిస్, నెస్లె, ఇండస్ఇండ్ బ్యాంకు ల షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, పవర్గ్రిడ్, ఎస్బీఐ, రిలయన్స్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే ఆటో, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్కేర్, యుటిలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఎనర్జీ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి.