Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,200 పాయింట్లకుపై లాభాల్లో ఉండగా.. నిఫ్టీ 350 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నది. ప్రస్తుతం సెన్సెక్స్ 57,865.94 పాయింట్లు, నిఫ్టీ 17,198.75 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల పవనాలతో భారీ లాభాలను నమోదు చేశాయి. దాదాపు అన్నిరంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
దాదాపు 1633 షేర్లు పురోగమించగా.. 250 షేర్లు నష్టపోగా.. 65 షేర్లలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. బీఎస్ఈలో అదానీ ఎంటర్ప్రైజెస్, ఇన్ఫోసిస్, రిలయ్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీలో హిందాల్కో, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, లార్సెన్, టీసీఎస్ టాప్ గెయినర్స్గా నిలువగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరో వైపు ఆసియా మార్కెట్లలో నిక్కీ 2.86శాతం పెరిగి..26,966 పాయింట్లు, స్ట్రెయిట్స్ టైమ్స్ 3132.75 పాయింట్లకుపైగా లాభాలను నమోదు చేశాయి. హంగ్సెంగ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.