Stocks | ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకొస్తుందన్న అంచనాల మధ్య బుధవారం మొదలైన అమెరికా ఫెడ్ రిజర్వ్ బోర్డు భేటీ ప్రభావం మంగళవారం దేశీయ స్టాక్మార్కెట్లపై పడింది. వరుసగా రెండో రోజూ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ నష్టాలతోనే ముగిశాయి. అన్ని సెక్టార్ల ఇండెక్స్లు నెగెటివ్ జోన్లోనే సాగాయి. సెన్సెక్స్ 498 పాయింట్ల (0.89 శాతం) నష్టంతో 55,268 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 147 పాయింట్లు (0.88 శాతం) పతనమై 16,484 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ సుమారు మూడు శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.5 శాతం నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఒక్కో శాతానికి పైగా నష్టపోయాయి.
ఇన్ఫోసిస్, హెచ్యూఎల్, యాక్సిస్ బ్యాంక్ స్క్రిప్ట్లు 3-3.5 శాతం మధ్య నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఆటో, విప్రో, దివిస్ ల్యాబ్స్, ఎచిర్ మోటార్స్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్.. ఒక్కొక్కటి రెండు శాతానికి పైగా పతనం అయ్యాయి. మరోవైపు జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, భారతీ ఎయిర్టెల్ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇక ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో స్క్రిప్ట్ వరుసగా రెండోరోజూ నష్టాలతోనే ముగిసింది. మంగళవారం కూడా 11 శాతం నష్టంతో సరికొత్త కనిష్ట స్థాయి నమోదైంది. ఏడాది లాకిన్ పీరియడ్ ముగియడంతో జొమాటో షేర్ రెండు రోజుల్లోనే 23 శాతం నష్టపోయింది.