ముంబై: భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి జోరు కనబర్చిన దేశీయ ఈక్విటీ సూచీలు ఇవాళ ఏకంగా 1.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛే్ంజ్ సూచీ నిఫ్టీ 1.38 శాతం వృద్ధితో 243 పాయింట్లు లాభపడి 17,854 వద్ద ముగిసింది. అదేవిధంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ కూడా 1.52 శాతం వృద్ధితో 909 పాయింట్లు లాభపడి 60,841 వద్ద క్లోజయింది.
ఇన్నాళ్లు భారీ నష్టాలు మూటగట్టుకున్న అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో కొన్ని కంపెనీల షేర్లు ఇవాళ పుంజుకున్నాయి. నిఫ్టీలో అదానీ పోర్ట్స్ ఇవాళ టాప్ గెయినర్స్లో ఒకటిగా ఉన్నది. అదేవిధంగా టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా టాప్ గెయినర్స్లో ఉన్నాయి. కాగా, దివీస్ ల్యాబ్, అదానీ ఎంటర్ప్రైజెస్, బీపీసీఎల్, టాటా కన్జ్యూమర్, హిందాల్కో కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి.
ఇక బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నాయి. కేవలం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మాత్రమే నష్టాలు మూటగట్టుకుంది. అదానీ పోర్ట్స్ షేర్లలో దాదాపు 6 శాతం వృద్ది నమోదు కావడం, అమెరికన్ డాలర్తో పోల్చితే ఇవాళ రూపాయి మారకం విలువ 34 పైసలు బలపడటం దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చిందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.