Stock Market Open | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో మొదలయ్యాయి. ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాలతో సూచీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బుధవారం సెన్సెక్స్ 72,996.31 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ 73,149.34 పాయింట్ల వద్ద లాభాలతో మొదలైంది. ప్రారంభంలోనే 167.16 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 458.44 పాయింట్లు ఎగిసి 73,454.75 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ సైతం 164.30 పాయింట్లు పెరిగి 22,287.95 వద్ద కొనసాగుతున్నది. ఇప్పటి వరకు
దాదాపు 1,599 షేర్లు పురోగమించగా.. 534 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్ప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, టైటాన్ కంపెనీ, ఎంఅండ్ఎం, బ్రిటానియా ఇండస్ట్రీస్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.