Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం వరుసగా మూడో సెషన్లో ఇంట్రా డే ట్రేడింగ్లో ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 76,010 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకి, ట్రేడింగ్ ముగిసే సమయానికి 20 పాయింట్ల నష్టంతో 75,391 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 23,111 పాయింట్లతో ఆల్ టైం గరిష్టానికి దూసుకెళ్లి ట్రేడింగ్ ముగిసే సమయానికి 25 పాయింట్ల నష్టంతో 22,932 పాయింట్ల వద్ద ముగిశాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్ ఆల్ టైం హై 43,985 పాయింట్ల నుంచి 43,784 పాయింట్లకు పడిపోగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ సైతం ఆల్ టైం గరిష్టానికి దూసుకెళ్లి.. చివరకు 0.09 శాతం పతనంతో ముగిసింది. నిఫ్టీ పీఎస్యూ ఇండెక్స్ ఒక శాతానికి పైగా పుంజుకోగా, నిఫ్టీ బ్యాంకు 0.6 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.85 శాతం లాభ పడ్డాయి.