Stocks on Budget Day | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం పుంజుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదించనున్న నేపథ్యంలో ఉదయం ప్రారంభ ట్రేడ్లో ఈక్విటీ ఇండెక్స్లు శుభారంభం అందుకున్నాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 640.01 పాయింట్ల లాభంతో ఇంట్రా డే ట్రేడింగ్లో ఆల్ టైం గరిష్టం 60,189.91 పాయింట్లను తాకింది. అటుపై 516.35 పాయింట్ల లబ్ధి వద్ద 60,066.25 పాయింట్ల వద్ద నిలిచింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 1218 పాయింట్లు పెరిగి 60,767 పాయింట్లకు దూసుకెళ్లింది.
మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ ఇండెక్స్ నిఫ్టీ 137.35 పాయింట్లు పెరిగి 17,799.50 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. మార్కెట్ వర్గాలు నిశితంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తీరు తెన్నులను గమనిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ద్రవ్య నియంత్రణ విధానంపై ఇన్వెస్టర్లు ఫోకస్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లు ఇన్వెస్టర్ సెంటిమెంట్ను బలోపేతం చేసేలా లాభాలతో సాగుతున్నాయి. సెన్సెక్స్లో 27 స్టాక్స్ లాభాలతో సాగుతుండగా, మూడు స్టాక్స్ మాత్రమే నష్టపోతున్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రధానంగా లాభాల్లో సాగుతున్నాయి. ఈ స్టాక్స్ 2.92 శాతం వరకు లబ్ధి పొందాయి. మరోవైపు ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా నష్టపోయిన స్టాక్స్