Stock Market | రెండు రోజుల నష్టాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 547.83 పాయింట్లు పెరిగి 55816.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 158 పాయింట్లు పెరిగి 16,641.80 వద్ద ట్రేడింగ్ ముగిసింది. నిఫ్టీలో సన్ ఫార్మా, ఎస్బీఐ, ఎల్అండ్టీ, దివీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్లో ఉండగా.. భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, యూపీఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. బ్యాంక్, ఐటీ, మెటల్, ఆయిల్, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, పీఎస్యూ బ్యాంక్, ఫార్మా సూచీలు అన్ని రంగాల సూచీలు ఒకటి నుంచి రెండుశాతం లాభపడ్డాయి. మంగళవారం నాటి డాలర్తో పోలిస్తే రూపాయి 14 పైసలు తగ్గి 79.90 వద్ద ముగిసింది.
మంగళవారం రోజున విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) మార్కెట్ నుంచి రూ.1548.29 కోట్లను ఉపసంహరించుకున్నారు. దేశీయ ఇన్వెస్టర్లు (డీఐఐలు) ఈ కాలంలో మార్కెట్లో రూ.999.36 కోట్ల పెట్టుబడులు పెట్టారు. యూఎస్ ఫెడ్ వడ్డీ రేటును పెంచడానికి ముందు, మంగళవారం యూఎస్ మార్కెట్లలో సైతం అమ్మకాలు కనిపించాయి. డౌజోన్స్ 229 పాయింట్లు బలహీనపడి.. 31,761.54 వద్ద ముగిసింది. నాస్డాక్ 220 పాయింట్లు క్షీణించింది.. 11,562.57 వద్ద ముగిసింది. ఎస్ అండ్ పీ 500 సూచీ 46 పాయింట్లు నష్టపోయి 3,921.05 వద్ద ముగిసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలతో పెట్టుబడిదారులు జాగ్రత్తపడుతున్నారు.