ముంబై, జనవరి 31: మధ్యంతర బడ్జెట్కు ముందు స్టాక్ మార్కెట్లు రంకేశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లపై తీసుకోనున్న నిర్ణయం మదుపరులను కొనుగోళ్లవైపు నడిపించాయి. గురువారం మోదీ సర్కార్ వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడుతుండటం, వడ్డీరేట్లపై ఫెడ్ తీసుకునే నిర్ణయంపై పెట్టుబడిదారులు దృష్టి సారించారు.
ప్రారంభంలో భారీగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివర్లో 612. 21 పాయింట్లు అందుకొని 71,752. 11 పాయింట్లకు చేరుకోగా, మరో సూచీ నిఫ్టీ 203.60 పాయింట్లు అందుకొని 21,725.70 వద్దకు చేరుకున్నది. మరోవైపు, బుధవారం స్టాక్ మార్కెట్లో లిైస్టెన నోవా అగ్రిటెక్ షేరు అదరకొట్టింది. ఇష్యూ ధర రూ.41 కంటే 36.56 శాతం అధికంగా రూ. 56 వద్ద లిైస్టెంది. చివరకు 43.38 శాతం లాభపడి రూ.58.79 వద్ద ముగిసింది.