Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు గురువారం లాభాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ నష్టాలతో మొదలైనా తర్వాత పుంజుకున్నాయి. కానీ, ట్రేడింగ్ ముగింపు సమయంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి పతనమైనా చివరకు లాభాలతో స్థిర పడ్డాయి. ఐటీ స్టాక్స్ పుంజుకోగా, బ్యాంకింగ్ స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 306.5 పాయింట్లు (0.47 శాతం) లబ్ధితో 65,982.5 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్లో 66,358 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 19,875 పాయింట్ల ఇంట్రాడే గరిష్టానికి దూసుకెళ్లి.. ట్రేడింగ్ ముగిసే సమయానికి 87 పాయింట్ల (0.44శాతం) లబ్ధితో 19,800 పాయింట్ల దిగువ 19,762.5 పాయింట్ల వద్ద ముగిశాయి.
హీరో మోటో కార్ప్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎల్ అండ్ టీ మైండ్ ట్రీ, అపోలో హాస్పిటల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ 2-3.3 శాతం లాభ పడ్డాయి. ఎన్టీపీసీ, బీపీసీఎల్, విప్రో, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, దివిస్ ల్యాబ్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, అదానీ పోర్ట్స్ 0.5 -1.9 శాతం మధ్య లబ్ధి పొందాయి. బ్రాడర్ మార్కెట్లు బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 0.5 శాతం లాభంతో ముగిశాయి.
నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 0.24 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.15 శాతం, నిఫ్టీ బ్యాంక్ 0.09 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.7 శాతం, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్లు 0.8 శాతం లాభ పడ్డాయి.