Stocks | అంతర్జాతీయ బలహీనతలు, ప్రత్యేకించి అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచనున్నదన్న సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. వరుసగా రెండో రోజు కూడా పతనం అయ్యాయి. రెండు వరుస సెషన్లలో బీఎస్సీ సెన్సెక్స్ 1500 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 503 పాయింట్లు కోల్పోయింది. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్లో సెన్సెక్స్ 840 పాయింట్ల కనిష్టానికి పడిపోయి తిరిగి కోలుకుంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచితే అమెరికన్ ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరిస్తారన్న ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 56,580 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 ఒకానొక దశలో 16900 పాయింట్ల దిగువకు పడిపోయినా.. ముగింపులో187 కోల్పోయి 16,985 పాయింట్ల వద్ద నిలిచింది. ట్రేడింగ్లో 1000కిపైగా షేర్లు లాభపడగా, 2435 స్టాక్స్నష్టపోయాయి.
బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, నెస్ట్లే, భారతీ ఎయిర్టెల్, కొటక్ మహీంద్రా షేర్లు లాభాల గడించాయి. మరోవైపు కోల్ ఇండియా, బీపీసీఎల్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్, హందాల్కో టాటా మోటార్స్, సన్ఫార్మా షేర్లు 6.5 శాతం నష్టపోయాయి. టాటా కమ్యూనికేషన్స్, జుబిలెంట్ ఫుడ్ వర్క్స్, కుమిన్స్ ఇండియా, ఒబెరాయ్ రియాల్టీ, ఫ్యూచర్ గ్రూప్, బిర్లా టైర్స్ స్టాక్స్ 5-20 శాతం మధ్య నష్టపోయాయి. ఎన్ఎస్ఈ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 0.44 శాతం లాభ పడింది. నిఫ్టీ రియాల్టీ నాలుగు శాతం, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ మూడు శాతం పతనంతో ముగిశాయి.
ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల షేర్లు సోమవారం 20 శాతం వరకు నష్టపోయాయి. ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఫ్యూచర్ విలీనం ఒప్పందం నుంచి తప్పుకోవడంతో బీఎస్ఈలో ఫ్యూచర్ షేర్లన్నీ లోయర్ సర్క్యూట్ను తాకాయి. ఫ్యూచర్ సప్లయ్ చైన్ సొల్యూషన్స్ 20 శాతం నష్టపోయి రూ.37.30 వద్ద నిలిచింది. ఫ్యూచర్ రియాల్టీ ఐదు శాతం పతనమై రూ.27.80 వద్ద ముగిసాయి.