Stocks | వరుసగా ఆరు సెషన్లలో గడిస్తున్న లాభాలకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 888 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 19,750 పాయింట్ల వద్ద స్థిర పడింది. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ నాలుగు శాతం, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ ఒకశాతం పతనంతో ముగిశాయి.
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెవెన్యూ గ్రోత్ అంచనాల్లో భారీగా కోత విధించడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా ఐటీ స్టాక్స్లో ఇన్ఫోసిస్ భారీగా నష్టపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్పై ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ప్రైవేట్ బ్యాంకుల స్టాక్స్ నష్టపోయాయి. ఫలితంగా సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు దాదాపు రూ.2 లక్షల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి.
పలు బ్రోకరేజీ సంస్థల అంచనాలను తలకిందులు చేస్తూ ఇన్ఫోసిస్ తన తొలి త్రైమాసికం ఫలితాల్లో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెవెన్యూ గ్రోత్ అంచనాలను భారీగా తగ్గించేసింది. 2023-24లో కేవలం 1-3.5 శాతం గ్రోత్ మాత్రమే ఉంటుందని ఇన్ఫీ స్పష్టం చేసింది. మార్కెట్ వర్గాలు 2-4 శాతం మధ్య ఉంటుందని అంచనా వేశారు.
ఇన్ఫోసిస్తోపాటు హెచ్సీఎల్ టెక్, హెచ్ యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్స్ ఒకటి నుంచి 3.5 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు బీఎస్ఈ సెన్సెక్స్లో ఎల్ అండ్ టీ నాలుగు శాతం లాభంతో పుంజుకోగా, ఎన్టీపీసీ, ఎస్బీఐ, టాటా మోటార్స్ స్టాక్స్ లాభాలు పుంజుకోవడంతో నష్టాలు తగ్గాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.26 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.13 శాతం నష్టంతో ముగిశాయి. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ నాలుగు శాతం, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ ఒకశాతం పతనం అయ్యాయి. మరోవైపు నిప్టీ పీఎస్యూ బ్యాంక్, మీడియా, ఆటో ఇండెక్స్ 0.5 శాతం లాభాలతో ముగిశాయి.