ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలోనే లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 52,950 పాయింట్ల వద్ద మొదలైన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12.15 గంటల వరకు 53,100 పాయింట్లకు చేరుకుంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం ఉదయం 15,813 పాయింట్ల వద్ద మొదలై మధ్యాహ్నం 12.15 గంటల వరకు 15,900 మార్కును తాకింది.